1

Gentlemen Agreement

పెద్దమనుషుల ఒప్పందం

1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి - కోస్తారాయలసీమతెలంగాణా - అన్నిప్రాంతాల నాయకులూ ఇష్టపడ్డారుఅయితే తెలంగాణా నాయకులకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలుఉన్నాయిఅధిక రెవిన్యూ ఆదాయం గల తమ ప్రాంతంఅదే నిష్పత్తిలో అభివృద్ధికి నోచుకోదేమోనన్న భయం వారికికలిగిందిఇటువంటి ఇతర సందేహాల నివృత్తికై అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19  ఒకఒప్పందానికి వచ్చారుదీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారున్యూ డిల్లీ లో పెద్దమనుషుల ఒప్పందంసంతకాలు చేసిన రోజు 1956 ఫిబ్రవరి 20 అని కె.వి.రంగారడ్డి స్వీయచరిత్ర లో రాసారుసంతకాలు చేసిన వారుతెలంగాణా తరపునబూర్గుల రామకృష్ణారావుకె.వి.రంగారెడ్డిఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డిబెజవాడ గోపాలరెడ్డి,అల్లూరి సత్యనారయణ రాజుగౌతు లచ్చన్న ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:
  • కనీసం ఐదేళ్ళపాటుప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికార్యక్రమాలపై ఖర్చు పెట్టాలితెలంగాణా ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని  ప్రాంతపుఅభివృద్ధికే కేటాయించాలి
  • తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలిస్థానిక విద్యార్ధులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.
  • సివిలు సర్వీసులకుఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.
  • ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోనున్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.
  • రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలిముఖ్యమంత్రి కోస్తారాయలసీమ నుండి ఉంటేఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండిముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతరప్రాంతాల నుండి ఉండాలి.
  •  ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలిమండలి సభ్యులు తెలంగాణా ప్రాంతంనుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.
  • తెలంగాణాలో మద్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.
  • తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు  ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలనినిబంధన రూపొందించాలి.
  • కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
 ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగిఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు మార్గంసుగమమైంది.